జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కోతలు లేకుండా సరిపడా కరెంట్ సరఫరా చేస్తూ ముందుకెళ్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మిలీనియం క్వార్టర్స్ ఆవరణలో విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నూతనంగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయాలు నిర్మించారని తెలిపారు.
దానిలో భాగంగా జిల్లా విద్యుత్ శాఖ అధికారులు జిల్లా కార్యాలయానికి భూమి కావాలని కోరడంతో వెంటనే జిల్లా కేంద్రంలో ఎకరం భూమి కేటాయించామన్నారు. దీనిలో రూ. కోటి నిధులతో జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం నిర్మిస్తామన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో రోజుకు 7గంటల కరెంట్ మాత్రమే ఇచ్చేవారని, నేడు సీఎం కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ అందుతుందన్నారు.
జిల్లాలో ఇప్పటికే 6 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని, జిల్లాలో కరెంట్ అవసరాన్ని బట్టి మరో ఆరు సబ్ స్టేషన్లు తీసువస్తానన్నారు. జిల్లాలో ఇప్పటికే 1100 మెగావాట్ల విద్యుత్ సరఫరా కేంద్రం ఉండగా, 20 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఉందన్నారు. విద్యుత్ అధికారులు రైతులు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించి వెంటనే వారికి కరెంట్ సమస్యలు పరిష్కరించాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ బీబీ సింగ్, డీఈ నాగరాజు, జెడ్పీ వైస్ చైర్ పర్సన్ కల్లెపు శోభ, భూపాలపల్లి ఎంపీపీ మందల లావణ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా