నాకు ఎకరంన్నర భూమి ఉన్నది. దీని మీద పొత్కపల్లి కోఆపరేటివ్ బ్యాంకుల మూడేండ్ల కింద రూ.40 వేల అప్పు తీసుకున్న. గిప్పుడు ఆ పైసల్ మాఫీ అయినయ్. ఒక్కరూపాయి వడ్డీ చెల్లించలేదు. మస్తు సంతోషమనిపిత్తుంది. మళ్లా ఈ ఏడాది కొత్తగా రుణం తీసుకుంట. ఈ ప్రభుత్వం రైతులకు మంచి చేస్తున్నది. పడావుపడ్డ భూములకు నీళ్లిస్తున్నది. ఎరువులు, ఇత్తనాలు అందిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నది. రందిలేకుంట రెండు పంటలు పండించుకుంటున్నం.
5వ రోజు రుణమాఫీ
రైతుల సంఖ్య : 12,280
మాఫీ అయిన రుణం : రూ.36.29 కోట్లు
5 రోజుల్లో మొత్తం
రైతుల సంఖ్య : 74,032
మాఫీ అయిన రుణం : రూ.212.26కోట్లు