కాసిపేట, ఏప్రిల్ 26 : చుట్టుపు చూపుగా వచ్చీపోయే బడా వ్యాపారి (కాంగ్రెస్ అభ్యర్థి) కావాల్నో.. నిత్యం అందుబాటులో ఉండే సేవకుడు కావాల్నో ప్రజలే నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని దేవాపూర్ మేజర్ గ్రామ పంచాయతీలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఓరియంట్ కంపెనీ కార్మికులను నేరుగా కలిసి మాట్లాడారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు మనకు ఎంతో ప్రతిష్టాత్మకమని, మన అందరి క్షేమం కోసం బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కార్పొరేట్ వ్యాపారి అని, వారికి ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక ఉండదని, దీనిని ప్రజలంతా గమనించాలని కోరారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బంగారంలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని ప్రజలంతా బాధపడుతున్నారన్నాని గుర్తు చేశారు. బీఆర్ఎస్ గెలిస్తేనే అందరికీ మేలు జరుగుతుందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారులో అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశామని, కాంగ్రెస్ మాత్రం ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మెజార్టీతో పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, ఓసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, మాజీ సర్పంచులు ఆడె జంగు, ఆడె బాదు, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్ కార్యదర్శి మోటూరి వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంటెంకి వాస్దేవ్, దండవేణి చందు, కైలాస్, వడ్లూరి మల్లేశ్, ఏనుగు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
చెన్నూర్, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు నాయకు లు, కార్యకర్తలు శుక్రవారం పట్టణంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 4,5వ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను వివరించారు. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మె జార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్ రెవెల్లి మహేశ్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, నాయకులు రాంలా ల్ గిల్డా, మేడ సురేశ్రెడ్డి, నాయిని సతీశ్, కొండపర్తి వెంకటరాజం, ఆరీఫ్, ముత్యాల సత్యవతి, భారతి పాల్గొన్నారు.