హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఈ ఏడాది కూడా 30 శాతం సిలబస్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 70 శాతం సిలబస్తోనే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులకు ఆటంకాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక సిలబస్కు సంబంధించిన వివరాలు, మోడల్ ప్రశ్నాపత్రాలకు ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ www.tsbie.cgg.gov.in ను సంప్రదించొచ్చు.