హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపు లో దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ.. తాత్కాలిక పరిహార అటవీ నిర్మూలన ఫండ్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అథారిటీ (కంపా) కార్యక్రమాల అమలులోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. దీనికింద 2014-15 నుంచి 2022 -23 వరకు రాష్ట్రంలో పెద్దఎత్తున సహజ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర అనుబంధ పనుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించింది.
దాదాపు 82,166.178 హెక్టార్లలో అటవీ పునరుద్ధరణ చేపట్టింది. అటవీయేతర ప్రయోజనాల కోసం అటవీభూమిని మళ్లించడం వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించడం, నిధులు త్వరగా, సమర్థవంతంగా, పారదర్శకంగా వినియోగించడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నది.