హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వైఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్కు హైకోర్టు 4 రోజులపాటు ఎసార్ట్ బెయిల్ మంజూరు చేసింది. సునీల్ తండ్రి అంత్యక్రియలకు ఈ నెల 9, 10 తేదీలు, దశదిన కర్మల్లో పాల్గొనేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో ఎసార్ట్ బెయిల్ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది.
ఎసార్ట్గా ముగ్గురు కానిస్టేబుళ్లు లేదా ఎస్సైలను పంపాలని, ఈ ఖర్చులన్నీ సునీల్ భరించాలని పేర్కొన్నది. ఈ నెల 7న సునీల్ తండ్రి మరణించడంతో ఎసార్ట్ బెయిల్ పిటిషన్ వేయగా, శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.