హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మానవహకుల కమిషన్కు సివిల్ వివాదాలు, గృహహింస, కుటుంబ, దాంపత్య వివాదాల పరిషార పరిధి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మానవ హకుల కమిషన్ జారీచేసిన వేర్వేరు ఉత్తర్వులను సవాల్ చేసిన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. భూములు, స్థలాలపై హకులు, భూముల సర్వేపై వెలువరించిన ఆదేశాలనూ రద్దు చేసింది. మరో కేసులో వైద్యపరమైన నిర్లక్ష్యానికి సంబంధించిన కేసులో మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకున్నప్పటికీ కమిషన్ జోక్యం చేసుకొని ఉత్తర్వులివ్వడం సరికాదంది.
మ్యారేజీ బ్రోకరేజీ వ్యవహారంపై ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని స్పష్టంచేసింది. దాంపత్య వివాద నేపథ్యంలో తన కుమార్తెను చూసేందుకు అనుమతించాలంటూ ఒక కేసు, కొడు కు నిర్వహణ ఖర్చులు చెల్లించాలని మరో కేసు, గృహహింసకు చెందిన ఇంకో కేసులో హకుల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఆక్షేపించింది. కుటుంబ న్యాయస్థానాల్లో తేల్చాల్సిన కేసులను కమిషన్ విచారణ చేయడాన్ని తప్పుపట్టింది. మానవ హకుల కమిషన్ చట్టంలోని సెక్షన్ 12కు విరుద్ధంగా ఉత్తర్వులు వెలువరించిందని పేరొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా హకుల కమిషన్ వ్యవహరించిందన్నది. కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసిన పిటిషన్లో కమిషన్ను ప్రతివాదిగా చేయకపోవడంతో ఈ కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.