కాస్టింగ్పై కాకుండా కథపైనే ఎక్కువ శ్రద్ధపెట్టి, ఓ భిన్నమైన కాన్సెప్ట్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు దర్శకుడు క్రిష్. పూర్తిగా కొత్త నటీనటులతో ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. రీసెంట్గా డబ్బింగ్ని కూడా క్రిష్ పూర్తి చేశారు. మరో పదిరోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని, అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. క్రిష్ గత చిత్రాల మాదిరిగానే ఆలోచింపజేసే కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుందట.
ఈ సినిమాకు ‘జెన్ జీ బ్యాచ్’ అనే టైటిల్ని ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. వాణిజ్య అంశాలతోపాటు భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూ తనదైన శైలిలో క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించినట్టు చిత్రబృందం చెబుతున్నది. ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.