జగిత్యాల : గురుకుల పాఠశాలలను దేశానికే ఆదర్శనీయమని, పాఠశాలల్లో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో చదివే పిల్లల్లో ఆత్మ విశ్వాసం, ధైర్యం మెండుగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున గురుకులాల ఏర్పాటు జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? అని అన్నారు.
ఒక్క సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 1.30లక్షల మంది విద్యార్థు పత్రి సంవత్సరం.. నాలుగు గురుకుల విభాగాల్లో ఏటా 5లక్షల మంది విద్యనభ్యసిస్తున్నామన్నారు. కార్పొరేట్కు దీటుగా విద్య అందిస్తున్నామని, ఒక్కో విద్యార్థిపై దాదాపు లక్ష వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించి, వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. రాబోయే విద్యా సంవత్సరంలోనూ వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.