నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 15: కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం కర్షకుల ఖాతాల్లో జమ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆయా జిల్లాల్లో రైతులతోపాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.