హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అనాథ పిల్లలంతా ఇకపై సర్కారు బిడ్డలు(స్టేట్ చిల్డ్రన్స్) అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. విధి వంచితులను మానవీయ కోణంలో ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని శనివారం ప్రెస్మీట్లో స్పష్టంచేశారు. ‘రాజ్యాంగంలో మొదటి పేరాలోనే ఇండియా షల్ బీ ఏ వెల్ఫేర్ స్టేట్ అని ఉంటది. భారతదేశం ఒక సంక్షేమ రాజ్యం అని రాజ్యాంగ స్ఫూర్తిలోనే ఉన్నది. దాన్ని అనుసరించి సంక్షేమరాజ్యంగా ఉండే ఇండియాలో బాధితులు, దుఃఖితులు ఉండొదద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నం అనాథ పిల్లలను స్టేట్చిల్డ్రన్గా డిక్లేర్ చేయాలని చెప్పాం.
క్యాబినెట్ సబ్కమిటీ రికమెండేషన్స్ కూడా ఇచ్చింది. 8న హైటెక్స్లో జరిగే సభలో ఆ వివరాలు వెల్లడిస్తా. అనాథ పిల్లలను స్టేట్చిల్డ్రన్గా డిక్లేర్ చేయడంతో పాటు అనాథ శరణాలయాలను పూర్తిగా ఆదుకొని, వారికోసం ప్రత్యేకంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు ఏర్పాటుచేస్తాం. వారిని చదివించి, ఉద్యోగాల్లో కూడా కొంచెం రిజర్వేషన్ ఇవ్వాలని, గ్రాంట్ పెంచాలని నిర్ణయించాం’అని చెప్పారు. వీటిని కూడా ఉచితాలే అందామా? ఇవి ఉచితాల కిందకే వస్తాయా? అని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ నిలదీశారు.