హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఐర న్, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అం దజేయడంలో భాగంగా రాష్ట్రంలోని సర్కారు బడి విద్యార్థులకు రాగిజావను బ్రేక్ఫాస్ట్గా అందజేయ నున్నారు. రాష్ట్రంలోని 16.82 లక్షల మంది విద్యా ర్థులకు ఏడాదిలో 110 రోజులపాటు వారంలో 3 రోజులు రాగిజావను పంపిణీ చేస్తారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా దీనిని అందజేయనుండగా, ఇందుకు 2023-24 విద్యాసంవత్సరానికి పీఎం పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. శుక్రవారం కేంద్ర విద్యాశాఖ పీఏబీ మినిట్స్ను విడుదల చేసింది. పథకం కోసం మొత్తం రూ.27.76 కోట్లను వెచ్చించనుండగా, కేంద్రం రూ.16.18 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.11. 58 కోట్లను వెచ్చించనున్నాయి.
మధ్యాహ్న భోజనాన్ని వచ్చే విద్యా సంవత్సరం లో 231 రోజులపాటు అందజేయనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 231 రోజు లు, స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో 293 రోజలపాటు పంపిణీ చేస్తారు. ఈ పథకం అమలుకు అయ్యే వ్యయం రూ.323.71 కోట్లలో కేంద్రం రూ.203.76 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.119.95 కోట్లను వెచ్చించనున్నాయి. జాతీయస్థాయిలో కుక్ కమ్ హెల్పర్లకు నెలకు రూ.వెయ్యి పారితోషికాన్నిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 54,232 లబ్ధిదారులకు నెలకు రూ.3 వేలు అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ చొరవ పట్ల కేంద్రం ప్రశంసలు కురిపించింది.