హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): పాలకుర్తి ప్రజల కల నెరవేరింది. పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని 50 పడకల దవాఖానగా రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు గురువారం తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) జీవో జారీ చేసింది. రూ. 17 కోట్లా 50 లక్షలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
త్వరలోనే పను లు ప్రారంభించాలని ఆదేశించింది. దీనిపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. పాలకుర్తి ప్రజల కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు, మంత్రులు కేటీఆర్కు, హరీశ్రావుకు రుణపడి ఉంటానని పేర్కొంటూ, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత సెప్టెంబర్ 4న పాలకుర్తి పర్యటనలో మంత్రి హరీశ్రావు ఇచ్చిన హామీని ఈరోజు నిజం చేశారని కొనియాడారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.