Charla New Hospital | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఆదివాసీలు, గిరిజనులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రానికి 30 పడకల దవాఖానను మంజూరు చేసింది. చర్లలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇందుకు రూ. 10.70 కోట్ల నిధులను సైతం కేటాయించింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని 30 పడకల దవాఖానను 100 పడకల దవాఖానగా అప్గ్రేడ్చేసింది. అంతేకాకుండా ఈ దవాఖానకు అవసరమయ్యే పరికరాల కొనుగోలు, సివిల్ వర్క్స్ చేపట్టేందుకు రూ. 26 కోట్లను కేటాయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ మంగళవారం రెండు వేర్వేరు జీవోలను జారీచేశారు.