హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : జొన్నలు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జొన్న రైతులకు సూచించారు. అదిలాబాద్, నిర్మల్ జిల్లాల జొన్న రైతుల విజ్ఞప్తి మేరకు, సంబంధిత జిల్లా అధికారుల నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఎకరాకు 8.85 నుంచి 12 క్వింటాళ్ల వరకు పరిమితి పెంచుతుందన్నారు. మార్క్ఫెడ్ ద్వారా ఇప్పటికే క్వింటాల్కు రూ.3180 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు.