హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): వినూత్న పథకాలతో తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమలకు అండగా నిలుస్తున్నదని, త్వరలో మటన్ క్యాంటీన్ల ఏర్పాటుతో మరింత లబ్ధి చేకూర్చనున్నట్టు గొర్రెల, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ తెలిపారు.
మంగళవారం ఫెడరేషన్ వార్షిక నివేదికను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి బాలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మటన్ క్యాంటీన్లు ప్రారంభింభానికి సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, ఫెడరేషన్ ఎండీ డాక్టర్ రామచందర్, తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ మంజువాణి, డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ఫెడరేషన్ అధికారులు పాల్గొన్నారు.