హైదరాబాద్ : కొత్త జిల్లాలకు పోస్టుల మంజూరులో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. జనాభా దామాషా ప్రకారం పోస్టులను మంజూరు చేసింది. ఇలా రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయితీరాజ్ వంటి శాఖల్లో కొత్త పోస్టులను మంజూరు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
రెవెన్యూలో 3,560 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో అత్యధిక పోస్టులు జనాభా దామాషా ప్రకారం మంజూరు చేసినవే ఉన్నట్లుగా స్పష్టం చేస్తున్నాయి. వివిధ శాఖల్లోనూ ఇదే తరహాలో కొత్త పోస్టులను కేటాయించినట్లుగా ఉదహరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర పనిభారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు చేయాల్సిన పనిని ఒక ఉద్యోగి చేస్తున్నారు. దీనిని సరిచేయాలని భావించిన సర్కారు కొత్త పోస్టుల మంజూరుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.