Telangana to get Additional Loan | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. అదనపు రుణం తీసుకునేందుకు అనుమతించాలన్న ఏపీ సర్కార్ అభ్యర్థనను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిరాకరించింది. అదనపు ఆస్తులు సృష్టించడంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ వెనుకబడిందని శుక్రవారం పేర్కొంది. అందుకే అదనపు రుణం పొందలేకపోయిందని వలె్లడించింది.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మూల ధన వ్యయం లక్ష్యాలను చేరుకున్న ఏడు రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం కింద అదనంగా రుణం పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ జాబితాలో తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.
ప్రత్యేకించి తెలంగాణకు రూ.5,392 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. మిగతా రాష్ట్రాలు మూల ధన వ్యయ లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడ్డాయని కేంద్ర ఆర్థికశాఖ వివరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bhagyasree Daughter | జూనియర్ భాగ్యశ్రీ ఎంట్రీకి లైన్క్లియర్..!
SBI Alert | ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక.. అదేమిటంటే?!
5G Auction | ఏప్రిల్-మేలో 5జీ స్పెక్ట్రం వేలం.. ట్రాయ్లోనూ మార్పులు!
క్రిప్టోకరెన్సీలతో ఆర్ధిక వ్యవస్ధకు ముప్పు : ఆర్బీఐ గవర్నర్