హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీని తిట్టడంలో పోటీ పడుతున్న బీజేపీ నేతలకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే దమ్ము లేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ మండిపడ్డారు. అసలు అన్నదాతలకు బీజేపీ ఏం చేసిందని ఖమ్మంలో రైతు సభ పెట్టారని ప్రశ్నించారు.
రైతు వ్యతిరేక బిల్లులు తీసుకురావాలని చూసిన నీచమైన చరిత్ర బీజేపీదని, వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి ధర్నాలు చేసిన విషయం ప్రజలెవరూ మరిచిపోలేదని, ఆ పార్టీకి సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.