బాకీ చేసే బాధ తప్పింది
రైతుబంధు పైసలు టైముకు అందుతున్నయ్. ఇన్నేండ్లల్ల రైతుల కోసం మంచి పథకాలు పెట్టిన సర్కారు ఒక్కటి సుత లేదు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వచ్చినప్పటి నుంచే మంచి పథకాలు అమలైతున్నయ్. కేసీఆర్ సర్కారు వచ్చినంకనే రైతుల బాధలు తీరినయ్. నాకు మా ఊర్లె రెండున్నర ఎకరాల భూమున్నది.
యాడాదికి 25 వేల రూపాల రైతుబంధు అదునుకు అందుతాంది. ఈ సీజన్కు 12,500 రూపాలు బ్యాంకుల వడ్డయ్. ఇదివరకు వానకాలం వచ్చిందంటే బాకీ తప్పకపోయేది. ఇప్పుడా బాధ తప్పింది. రైతుబంధు తోటి పెద్ద రందితీరింది. కేసీఆర్ అసోంటి ముఖ్యమంత్రి ఉంటే ప్రతి రైతుకు ఎంతో మేలైతది. రంది లేకుంట ఎవుసం చేసుకోవచ్చు. బంగారు పంటలు పండియ్యచ్చు. ఒక రైతుకు ఇంతకన్న ఏం గావాలె.
– సోమేశ్వర్రావు, పాలకుర్తి, జనగామ జిల్లా