ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతలు ఉంటే, తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో చీకట్లను పారదోలి, వెలుగులు నింపామని, దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. గురువారం విద్యుత్తు సౌధ సమావేశ మందిరంలో తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంకల్పంతోనే విద్యుత్తు వెలుగులు సాధ్యమవుతున్నాయని తెలిపారు.
ఒకవైపు పెరిగిన ఇంధన ధరలు, మరోవైపు కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నప్పటికీ తెలంగాణ రికార్డు స్థాయిలో విద్యుత్తును సరఫరా చేస్తున్నదని చెప్పారు. టీజాక్ కన్వీనర్ శివాజీ మాట్లాడుతూ.. వేతన సవరణ సంఘాన్ని నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీజాక్ చైర్మన్ కోడూరి ప్రకాశ్, టీఈఈఏ ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య శెట్టి, సలహాదారు సురేందర్రెడ్డి, నాయకులు తుల్జారాంసింగ్, బందెల రవి, శ్రవణ్కుమార్ గుప్తా, నాసర్ షరీఫ్, ఆరోగ్యరాణి, వినోద్కుమార్, కరెంట్రావు, రమేశ్, మాతంగి శ్రీనివాస్, గణేశ్రావు, ఎంఎన్ రాజేశ్, తిరుపతయ్య, వెంకట్రామయ్య, పున్నా నాయక్ తదితరులు పాల్గొన్నారు.