Telangana DGP | హైదరాబాద్ : రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్( babu Jagjivan Ram ) జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి డీజీపీ అంజనీ కుమార్( DGP Anjani Kumar ) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ విజయ్ కుమార్, ఐజీలు షా నవాజ్ ఖాసీం, చంద్ర శేఖర్ రెడ్డిలతో సహా పలువురు అధికారులు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు, బడుగు వర్గాలకు చెందిన బాబు జగ్జీవన్ రామ్ భారత పార్లమెంట్లో పలు మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా, ఉప ప్రధానిగా కూడా పని చేశారని తెలిపారు.