హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. హైదరాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అన్నిరంగాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్రం కక్ష సాధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు అని చెప్పారు.