సూర్యాపేట: తెలంగాణలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో జరుగుతున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణవైపు (Telangana) చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గ్రామాలు, తండాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయని తెలిపారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే ముఖ్యమంత్రికి మద్దతుగా ఊరు.. వాడ ఏకమవడం శుభపరిణామమని వెల్లడించారు. సూర్యాపేట రూరల్ మండలం కాసారబాద్, సపావత్ తండాకు చెందని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో (BRS) చేరారు. అభివృద్ధికి మంద్దతుగా వచ్చిన కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ జీడీ బిక్షం, వైస్ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఈదుల యాదగిరి, సంకరమద్ధి రమణా రెడ్డి, ఎంపీటీసీ నాగమ్మ సైదులు, సర్పంచ్ రేణుక, నరేష్, లాలు నాయక్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.