పాలకుర్తి: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు పాఠశాల భవనాలను, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రంగరాయగూడెంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి అంగన్వాడీ పాఠశాలను ప్రారంభించారు.
కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను, పెద్ద బాయి తండా గ్రామ పంచాయతీ భవనాన్ని, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బాలుర రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని, హై స్కూల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ వేడుకల్లో జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.