CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ఎన్నికల హామీ మేరకు త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీకి తాము కట్టుబడి ఉన్నామని, కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమశాఖలపై శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలు, కొనసాగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని, వాటికి సొంత భవనాలను నిర్మించేందుకు స్థలాలను గుర్తించడంతోపాటు ఒకో సూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మొటిక్ చార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని, గ్రీన్ చానల్ ద్వారా చెల్లింపులు జరగాలని దిశానిర్దేశం చేశారు. మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ సాలర్షిప్ సీమ్ను మరింత సమర్థంగా అమలుచేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పుడున్న దాని కంటే ఎకువమంది అర్హులైన విద్యార్థులకు మేలు చేకూరేలా చూడాలని సూచించారు. ర్యాంకింగ్ల ఆధారంగా విదేశాల్లోని టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఒక ఫ్రేమ్వర్ రూపొందించాలని, వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ సీమ్లో మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ను రూపొందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సరిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక, బీసీ, ఎస్సీ, మైనార్టీశాఖల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి శాంతికుమారి, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ, ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శులు మల్లయ్యభట్టు, నవీన్నికోలస్, సంబంధిత శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా వాటికోసం ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని రేవంత్రెడ్డి ఆదేశించారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, తద్వారా సూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని వివరించారు. ఎకువమంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవడం ద్వారా వారిలో ప్రతిభా పాటవాలు పెరుగుతాయని, పోటీతత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి సరిపడా స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. నియోజకవర్గ కేంద్రంలో వీలు కాకుంటే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్లో మరో పట్టణం లేదా మండల కేంద్రాలను ఎంచుకోవాలని, ఇప్పటికే 20 ఎకరాలకుపైగా విస్తీర్ణమున్న సూల్ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్గా తీర్చిదిద్దే అవకాశాలుంటే పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థలు, కంపెనీల సహకారం తీసుకోవాలని, సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) ఫండ్స్ను సమీకరించాలని, దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు.