జహీరాబాద్, ఏప్రిల్ 20 : ఈనెల 24న మహారాష్ర్టలోని ఔరంగాబాద్లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. గురువారం ఆయన సభా ఏర్పాట్లను పరిశీలించి, గంగాపూర్, పైటన్ రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఔరంగాబాద్ సభకు తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మహారాష్ట్ర రైతు సంఘం నాయకులు మాణిక్కదం, శంకరన్న దొండ్గ పాల్గొన్నారు.