హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.