హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలి నేడు భేటీ (Cabinet Meeting) కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో వాహనాల రిజిస్ట్రేషన్ను ప్రస్తుతమున్న టీఎస్కు బదులు టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపి కేంద్రానికి సిఫారసు చేయనుంది. అదేవిధంగా కులగణనుకు ఆమోదం తెలపనుంది. మూసీ అభివృద్ధి, ఐటీ ఎగుమతులు, కొత్త ప్రభుత్వ దవాఖానలు, రాష్ట్రంలో అందుతున్న వైద్యంపై చర్చించనున్నారు. 6 గ్యారెంటీల అమలుకోసం బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రాధాన్యతపై చర్చించనున్నారు.
రైతు భరోసా, కౌలు రైతుల గుర్తింపు, రైతు కూలీ ఆర్థిక సహాయం, మహా లక్ష్మి పథకం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్దిదారుల గుర్తింపు, అమలుపై చర్చ జరుగనుంది. గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ.50 వేల కోట్ల బడ్జెట్ అవసరమని భావిస్తున్నది. ఇక గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. తుది నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వాణ తేదీలపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి క్యాబినెట్ ఆమోదం, సాగునీటి రంగంపై శ్వేత పత్రం విడుదల చేసే అంశంపై చర్చించనున్నారు. కొడంగల్-నారాయణ పేట ఎత్తిపోతల పథకానికి మంత్రిమండలి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తున్నది.