హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సీఎం కేసీఆర్ను కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఈ మేరకు విజ్జపన పత్రం అందజేశారు. వినతిపత్రాన్ని అందుకున్న సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్, కార్మిక నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి, కింగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.