ఉప్పల్, సెప్టెంబర్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వాదించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీరావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ శ్రీరాంనగర్లో శనివారం నిర్వహించిన డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో విజయలక్ష్మి మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లురాని వారు అధైర్యపడవద్దని, స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలతో గృహలక్ష్మి పథకం అమలవుతున్నదని చెప్పారు.
మంత్రి కేటీఆర్ సహకారంతో జీహెచ్ఎంసీలో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నామని అన్నారు. హైదరాబాద్లో స్థలం దొరకడమే కష్టంగా ఉన్నప్పటికీ రూ.50-రూ.60 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు కేటాయించడం గొప్ప విషయమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.