హైదరాబాద్, మార్చి 12 : రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితిని మూడేండ్లకు పెంచుతూ వ్యవసాయ చట్టంలో సవరణలు తీసుకొచ్చే బిల్లును శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెండేండ్లు ఉన్న మార్కెట్ కమిటీ పాలకవర్గ సమయాన్ని మూడేండ్లకు పెంచారు. పాలకవర్గ సభ్యుల సంఖ్యను 18కి పెంచారు. రైతు ప్రతినిధులను 8 నుంచి 12కు పెంచారు. ఈ మేరకు చట్ట సవరణ బిల్లును వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రవేశపెట్టారు. ఎఫ్ఆర్బీఎం పరిధి జీఎస్డీపీకి అనుగుణంగా పెంచడానికి సంబంధించిన బిల్లును సభ ముందుంచారు. జీఎస్డీపీలో ఐదు శాతం ఎఫ్ఆర్బీఎం పెంచుకునేందుకు వీలుగా సవరణ తీసుకొచ్చారు.