హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేపల పెంపకానికి ప్రోత్సాహం, కొత్త ఆహారభద్రతా కార్డుల జారీ, అర్బన్ మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి – షాదీముబారక్, ఆర్టీసీ కార్గో సేవలు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.