ఖమ్మం : కోటి ఎకరాల్లో వరి సాగు చేయడం ద్వారా దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం వెలుగొందుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
మంగళవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల, పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ర్టాల కన్నా మిన్నగా ధాన్యం ఉత్పత్తి చేయడమే కాకుండా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐకి అప్పగిస్తున్న ఘనత తెలంగాణ రాష్ర్టానిదేనని అన్నారు.
దేశవ్యాప్తంగా కేంద్రం రైతులను వ్యవసాయ చట్టాల పేరుతో ఇబ్బందులు పెడుతుంటే రైతు పండించిన పంటకు గిట్టబాటు ధర, పంట వేసుకోవడానికి అవసరమైన పెట్టబడిని రైతుబంధు రూపంలో ఇస్తూ ఆపద్బాంధవుడిగా కర్షకుల హృదయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెరగని ముద్రవేశారని తెలిపారురు.
రాష్ట్రలో రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ధాన్యాన్ని తేమ శాతం లేకుండా విక్రయించి సీఎం కేసీఆర్ ప్రకటించిన మద్దతు ధరను పొందాలని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు వివిధ రూపాల్లో భరోసా కల్పిస్తుంటే కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రైతుల వద్దకు యాత్రల పేరుతో వెళ్లి వారికి లేని రందిని సృష్టిస్తున్నరని విమర్సించారు.
ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
శస్త్రచికిత్స వికటించి మహిళా సర్పంచ్ మృతి
బీన్స్తో డయాబెటిస్కు చెక్..!
కల్తీ కల్లుతో ఆరుగురికి అస్వస్థత
రైతులు ఇబ్బందులు పడొద్దనే కొనుగోలు కేంద్రాలు : మంత్రులు
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచండిలా..!