నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ కోర్టుకు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో కల్లు వ్యాపారులను బెదిరించిన కేసులో తీన్మార్ మల్లన్నపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి తీన్మార్ మల్లన్న రిమాండ్ కు పంపారు.
ఈ నెల మొదటి వారంలో బెయిల్ రాగా..శుక్రవారం కేసు వాదనల నేపథ్యంలో బోధన్ కోర్టుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. కోర్టు ఎప్పుడు పిలిచినా వచ్చి నేరుగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి