హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూ (తెలంగాణ) ప్రభుత్వాన్ని కోరింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో బుధవారం సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎం చెన్నయ్య అధ్యక్షతన జరిగింది. జీవో -317తో నష్టపోయిన వారికి స్పౌజ్ బదిలీలు చేపట్టాలని, పెండింగ్లో ఉన్న అన్నిరకాల ఆర్థిక బిల్లులను వెంటనే చెల్లించాలని, ఒక శాతం బేసిక్ పేతో ఈహెచ్ఎస్ను అమలు చేయాలని కోరుతూ తీర్మానాలను ఆమోదించారు.
ప్రధాన కార్యదర్శిగా భిక్షంగౌడ్
పీఆర్టీయూ (తెలంగాణ) రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా సుంకరి భిక్షంగౌడ్ను రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్రెడ్డి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, సంఘం గౌరవ అధ్యక్షుడు పర్వతి సత్యనారాయణ, కోశాధికారి ఎన్ చంద్రశేఖర్రావు, కే శేఖర్రెడ్డి, వెంకట్రెడ్డి, గోలి పద్మ తదితరులు పాల్గొన్నారు.