హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా పడుతున్న వానలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలయ యం కావడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రభుత్వం కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేసి పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గడిచిన 24 గంటల్లో 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్ట టీఎస్డీపీఎస్ తెలిపింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
మానేరులో చిక్కుకున్న గొర్రెల కాపరి..
సిరిసిల్ల సాయినగర్కు చెందిన గొర్రెల కాపరి మొగిలి చంద్రమౌళి సోమవారం ఉదయం 10 గంటలకు గొర్రెలను మేతకు మానేరు దిగువకు తీసుకెళ్లాడు. వాగు మధ్యలో ఎత్తైన ప్రదేశంలోకి వెళ్లగా ఒక్క సారిగా వరద చుట్టుముట్టింది. దీంతో అక్క డే 34 గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఉదయం 11 గంటల ప్రాం తంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లిన ఐదుగురు వలస కూలీలు సైతం వరదలో చిక్కుకుని గొర్రెలకాపరి ఉన్న ప్రాంతానికి చేరుకొన్నారు. గొర్రెలకాపరితో కలిసి ఒడ్డుకు వచ్చే ప్రయత్నంలో మరోసారి అందరూ వరదలో చిక్కుకుని ఓ మొద్దును పట్టుకొని ఆగిపోయారు. తెప్పతో వెళ్లిన మరో వ్యక్తి అక్కడే చిక్కుకున్నాడు. సాయంత్రం పోలీసులు, రెస్క్యూటీం సాయంతో అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు.
నీట మునిగిన బస్సు..
రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట శివారులో సోమ వారం మానేరు వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం వరద ఉధృతితో పూర్తి గా మునిగిపోయింది. 20 మంది ప్రయాణీకులతో కామారెడ్డి నుంచి సిద్దిపేట వెళ్తుండగా లింగన్నపేట రోడ్డాంపై నిలిచిపోగా ప్రయాణికులను స్థానికులు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. బస్సును జేసీబీ సాయం తో బయటకు తీసేందుకు చేసిన ప్రయ త్నం విఫలమైంది. అక్కడే ఉన్న బస్సు వరద ఉధృతికి నీట మునిగింది.
ఆదిలాబాద్లో పిడుగుపడి ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యా యి. తలమడుగు మండలం బరంపూర్లో వ్యవసాయ పనులు చేస్తున్న మహారాష్ట్రకు చెందిన సంగీత(31) పిడుగుపాటుకు మృతిచెందింది. కౌసల్య, సుజాత, అర్జున్కు గాయాలయ్యాయి. సిరికొండ మండలం సౌత్మరిలో పొలం పనులు చేస్తుండగా పిడుగుపడి గంప లక్ష్మి(30) మృతిచెందిం ది. ఆమె భర్త గాయపడ్డాడు.
కేటీఆర్ అభినందన
మానేరులో గొర్లకాపరి చిక్కుకున్న విషయాన్ని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఫోన్లో ఆదేశించారు. మంగళవారం సాయంత్రం చంద్రమౌళి, మరో ఆరుగురిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ సందర్భం గా పోలీసులు, రెవెన్యూ అధికారులు, రెస్యూ టీం సభ్యులను మంత్రి ఫోన్ లో అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీవర్షాలతో వాగులు, పరీవాహక ప్రాంతాల్లోకి వెళ్లవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
నేడు పలుచోట్ల భారీవర్షం
విదర్భ, పరిసర మధ్యప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడిందని హైదరాబా ద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు వ్యాపిం చింది. నైరుతి రుతుపవనాలు సైతం చురుకుగా కదులుతున్నాయని, ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వెల్లడించింది. బుధవారం ఉదయం వరకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగా మ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరిక జారీచేసింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉం టుందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. గడిచిన 14 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా కుం టాలలో 19.28 సెంటీమీటర్లు, ఖ మ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు వద్ద 18.60, కామారెడ్డి జిల్లా బీబీపేట 14.10, నిర్మల్ జిల్లా భైంసా 13.10, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ హసన్పల్లె 12.08సెంటీ మీటర్ల వర్షం నమోదైనట్టు వెల్లడించింది.