హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): డబుల్బెడ్రూం ఇండ్లను ఎప్పుడిస్తారంటూ మొరిగే రాజకీయ కుక్కలకు ఇప్పుడు పంపిణీ చేస్తున్న ఇండ్ల పట్టాలే సమాధానమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్పల్లిలో జరిగిన ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావుతో కలిసి పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మిగిలిన 59 వేల ఇండ్లను దశలవారీగా పంపిణీ చేస్తామని చెప్పారు. రూ.10 వేల కోట్లతో గ్రేటర్ వ్యాప్తంగా నిర్మించిన 69,532 ఇండ్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లక్షలు విలువ చేసే ఇండ్లను అమ్ముకోవద్దని సూచించారు. అమ్మిన, కొనుగోలు చేసిన వారికే నష్టం జరుగుతుందని అన్నారు. 14 రోజుల తర్వాత అధికారులే లబ్ధిదారులకు ఫోన్ చేసి ఇంటి తాళాలను అప్పగిస్తారని చెప్పారు.