హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫిర్యాదుపై జనగామ, చేర్యాల ఎస్హెచ్వోలు చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. అధికారిక విధులను నిర్వహించకుండా తన కుమార్తె పీ తుల్జాభవానీరెడ్డి, అల్లుడు రాహుల్రెడ్డి అడ్డుకుంటున్నారని, దీనిపై జూన్ 22న పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని యాదగిరిరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ సీవీ భాసర్రెడ్డి ఇటీవల ఈ ఆదేశాలను జారీచేశారు.
ఎమ్మెల్యే ఫిర్యాదుపై చేపట్టిన చర్యలను వివరిస్తూ జూలై 25న నివేదిక అందజేయాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శితోపాటు, డీజీపీకి, జనగాం, సిద్దిపేట డీసీపీలకు నోటీసులు జారీచేశారు.