హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో ప్లాట్లు, ఇండ్లు, విల్లాల కోసం వెతుకుతున్న వారికి ఉపయుక్తంగా ఉండేందుకు ఏటా టీన్యూస్ నిర్వహించే ప్రాపర్టీ ఎక్స్పో శని, ఆదివారాల్లో జరగనున్నది.
మాదాపూర్లోని హైటెక్సిటీలోని మేడన్ ఎక్స్పో సెంటర్లో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ను ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శనివారం ప్రారంభిస్తారు. సందర్శకులకు ఉచిత ఎంట్రీ అవకాశం కల్పించగా, పలు స్థిరాస్తి సంస్థలకు చెందిన సమాచారాన్ని ఒకే దగ్గర పొందే అవకాశాన్ని కల్పించారు.