మునిపల్లి/సంగారెడ్డి : జిల్లాలోని మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మిషన్ భగీరథ మంచి నీళ్లు గ్రామానికి సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అంగథ్ కుమార్ను సస్పెండ్ చేశారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనులు, హరితహారం, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో అలసత్వం వహించిన పంచాయతీ కార్యదర్శి నందీశ్వర్ను సస్పెండ్ చేశారు. గ్రామ సర్పంచ్ పార్వతికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
ఏపీఎంకు గ్రామంలో మహిళా సంఘాలచే మహిళలకు తడి, పొడి చెత్త వేరు చేయడంలో అవగాహన కల్పించనందున షోకాజ్ నోటిస్ జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. హరిత హారంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీవోకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. గ్రామ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో రమేశ్ చంద్ర కులకర్ణిని కలెక్టర్ నియమించారు. పల్లె ప్రగతి, హరితహారం, పారిశుద్ధ్య పనులు గ్రామంలో రెండు రోజుల్లో పూర్తి చేయాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
పరవళ్లు తొక్కుతున్న పొచ్చర జలపాతం
నరసింహులపల్లి సమస్యలను పరిష్కరిస్తా : మంత్రి కొప్పుల
టీఆర్ఎస్ పార్టీలోకి ఎల్ రమణ?
బ్లాక్ ఫంగస్తో హెల్త్ సూపర్ వైజర్ మృతి