నాగర్కర్నూల్ : అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సర్పంచ్లపై వేటు పడింది. జిల్లాలో పల్లెప్రగతి, వైకుంఠ ధామం నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన పెద్దకొత్తపల్లి మండలం దేదీనేని పల్లి సర్పంచ్ కె. రజిత, బలమూర్ మండలం మహాదేవుపూర్ గ్రామ సర్పంచ్ ఎ. మయూరి, ఉప్పునూతల మండలం అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ ఊర్మిళ తమ గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ శర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. పల్లెప్రగతి, పారిశుధ్యం, హరితహారం లాంటి కార్యక్రమాల్లో సర్పంచులు కానీ, పంచాయతీ సెక్రెటరీలు కానీ తమ విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు
జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోతారు