హైదరాబాద్ : ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాత మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( Jagadish Reddy) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి సిగ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అడుగుజాడలో నడుస్తూ తెలంగాణ కోసం జగదీష్రెడ్డి అహర్నిశలు కష్టపడ్డారని గుర్తు చేశారు. , కాళేశ్వరం ( Kaleshwaram ) జలాలతో సూర్యాపేట బీడు భూములను సస్య శ్యామలం చేసి, పాలన రంగంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోతి విజయ్, నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ ,కురువ పల్లయ,రమేష్, జంగయ్య, నరేష్, మిథున్, అవినాష్, నాగరాజు, సురేష్, సిసిందర్ తదితరులు పాల్గొన్నారు.