హైదరాబాద్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ రస్తోగి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.