బజార్హత్నూర్, మే 18 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ విద్యుత్ సబ్స్టేషన్ను సోమవారం టెంబి గ్రామస్తులు ముట్టడించారు. ఈ సందర్భంగా టెంబి సర్పంచ్ రాంరెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులుగా టెంబి, మంజారం తండా, ధర్మపురి, అనంతపూర్, చిన్నమీయా తండాలకు గంటల తరబడి విద్యుత్సరఫరాను నిలిపి వేస్తున్నారని ఆరోపించారు.
దీంతో ఉకపోత, దోమల బెడదతో ఇబ్బందులకు గురవుతున్నామని, నిద్రలేక అనారోగ్యం పాలవుతున్నామని, తాగునీటికి ఇబ్బంది అవుతున్నదని వాపోయారు. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడిస్తే అకడ సిబ్బంది ఎవరూలేరని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల తీరు మార్చుకోకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.