హైదరాబాద్, జూన్2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలి సి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ జలసౌధలో మంగళవారం సమీక్షించారు.
పాలమూరు పర్యటనలో సీఎంతోపాటు డిప్యూటీ
సీఎం భట్టి, మంత్రులు ఉంటారని తెలిపారు. జిల్లాలో ప్రాజెక్టుల పనుల తాజా పురోగతి నివేదికలను సిద్ధంచేసి అందించాలని ఆదేశించారు. జూ న్ 4న సా యంత్రం సోమశిలలో పా లమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కో యిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఇత ర కీలక నీటిపారుదల ప్రాజెక్టుల పనులపై ప్రజెంటేషన్లు ఉంటాయని తెలిపారు. నిధుల అవసరాలు, ప్రాజెక్టు ల పూర్తికి షెడ్యూల్ ఇవ్వాలని సూ చించారు. ప్రతి అంశం అమలయ్యే లా అన్నిశాఖలతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.