పెద్దపల్లి : విద్యార్థుల్లో దాగివున్నప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ లాంటి వేదికలు ఎంతగానో ఉపయోగ పడుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయ
బాలల దినోత్సవ సందర్భంగా అదివారం గోదావరిఖని పట్టణం మార్కండేయాకాలనీ శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో తెలంగాణ బాలోత్సవం 2021 కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని సాధన చేస్తే విజయం మీ సొంతమవుతుందన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రామగుండం నియోజకవర్గంలో అన్ని వర్గాలను ప్రోత్సహిస్తూ వారికి కావాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలను చేపట్టడం ఎమ్మెల్యే చందర్ కే సాధ్యమవుతుందన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంటోలను అందించారు.
కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, టిబిజికె ఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, కార్పొరేటర్లు పెంట రాజేష్, బాల రాజ్ కుమార్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య మిర్యాల రాజిరెడ్డి కెంగర్ల మల్లయ్య, వడ్దెపల్లి శంకర్, మెతుకు దేవరాజ్, టాస్మ సంఘ బాధ్యులు అందర నండె సమ్మారావు, కంది రవీందర్ రెడ్డి, బండారి యాదగిరిగౌడ్, అమరేందర్ రావు, కొత్త శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్
TS ICET 2021 | టీఎస్ ఐసెట్ తొలి దశ సీట్ల కేటాయింపు
Road accident | టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి