హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శనివారం శాసనమండలిని సందర్శించారు. విద్యార్థులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వాణిదేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్ సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీలతో ఫొటో దిగారు. మండలి పనితీరును తెలుసుకోవడంతోపాటు విద్యార్థులకు ప్రజాసేవపై ఆసక్తి పెరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.