ఆదిలాబాద్ : ఆదిలాబాద్(Adilabad) రిమ్స్(RIMS) మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన(Students agitation)రెండు రోజులుగా కొనసాగుతున్నది. డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రెండో రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి కాలేజీ ఆవరణలో ఘర్షణ చోటు చేసుకున్నది. క్యాంపస్లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంటర్న్షిప్ చేస్తున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
క్రాంతి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్తోపాటు క్యాంపస్లోకి వచ్చిన బయటి వ్యక్తులే తమపై దాడికి పాల్పడ్డారని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తూ కాలేజీ హాస్టల్ వద్ద ధర్నాకు దిగారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్(Assistant Professor Kranti Kumar)ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు(dismissed) డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. అయినప్పటికి శాంతించని విద్యార్థులు డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ను తొలగించాలని ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళన పై కమిటీ సభ్యులు విచారణ జరుపుతున్నారు.
Read related News
క్యాంపస్లో అసలు ఏం జరిగింది?.. ఎందుకు విద్యార్థుల ఆందోళన?