హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకొనేందుకు తెలంగాణ తరహాలో మరో పోరాటానికి శ్రీకారం చుడుతామని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఫీజులపై పోరుకు సిద్ధమని వెల్లడించాయి. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించాయి. మంగళవారం హైదరాబాద్లోని నిజాం కాలేజీలో అఖిలపక్ష యూనివర్సిటీ విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి నేతలు నల్ల కండువాలతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చుతున్నదని జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆరోపించారు. బకాయిలను విడుదల చేయని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశంలో పలు వర్సిటీల నేతలు ఉమేశ్, వంశీ, సంజయ్, పాపారావు, మహేందర్, అజయ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
రీయింబర్స్మెంట్ పథకాన్ని సర్కార్ నిర్వీ ర్యం చేస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్వీ అధ్యక్షు డు గెల్లు శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సర్కార్కు విద్యార్థుల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యే ల జీతాలు, అలవెన్స్లకు డబ్బులుంటాయి.. కానీ విద్యార్థుల చదువులకు ఇచ్చే రీయింబర్స్మెంట్కు డబ్బులుండవా? అని ప్రశ్నించారు. విద్యా భరోసాకార్డు ఊసేలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. కాంగ్రెస్ వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యమానికి శ్రీకారంచుడుతామని తెలిపారు.